అగ్రి పీజీతో.. ఉజ్వల కెరీర్...!
అగ్రికల్చర్ సైన్స్ విభాగంలో పేజీ, పీహెచ్డీ పూర్తి చేశారా.. ఈ రంగంలో ఉజ్వల అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా.. ముఖ్యంగా ప్రభుత్వ విభాగాల్లో... కొలువులు కోరుకుంటు న్నారా..! మీ లక్ష్యం ఇదే అయితే.. మీకో చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్ రీసెర్చ్ బోర్డ్ (ఏఎస్ఆర్జ్బే). ప్రతి ఏటా అగ్రి యూనివ ర్సిటీల్లో లెక్చర్షిప్ అర్హతకు.. అదే విధంగా అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీసెస్లో సైంటిస్ట్ పోస్ట్లకు, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్ట్లకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. ఇందుకోసం తాజాగా ఏఎస్ఆర్ బీ-నెట్, ఏఆర్ఎస్, ఎన్టీస్ ఎగ్జామినేషన్-2025 విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.... వీటికి సంబంధించిన వివరాలు, అర్హతలు, అవకాశాలు తదితర అంశాలపై విశ్లేషణ.
» ఏఎస్ఆర్మ్-నెట్, ఏఆర్ఎస్. ఎన్టీఓ
» నోటిఫికేషన్ విడుదల చేసిన ఏఎస్ఆర్ బీ.
» అగ్రి పిజీ ఉత్తీర్ణులకు ఉజ్వల అవకాశాలకు మార్గం
అగ్రికల్చర్ కోర్సుల్లో ఉన్నత విద్య పూర్తి చేసుకు న్నా.. అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి అనే అభిప్రాయం. దీనికి ఫుల్స్టాప్ పెట్టేలా.. ప్రభు త్వ వ్యవసాయ విశ్వ విద్యాలయాల్లో అధ్యాపక వృ త్తిలో అడుగు పెట్టేందుకు, అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీ సెస్లో సైంటిస్ట్స్ గా, సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్లుగా. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్లుగా కొలువు దీరేందుకు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పరీక్షే.. ఏఎస్ఆర్ బీ-నెట్, ఏఆర్ఎస్, ఎస్ఎంఎస్, ఎన్టీఓ పరీక్ష.
అగ్రి వర్సిటీల్లో అధ్యాపక వృత్తికి ఏఎస్ఆర్ బీ-నెట్
జాతీయ స్థాయిలో ఉన్న వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, అదే విధంగా రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయ విశ్వ విద్యాలయాల్లో ఆధ్యాపక వృత్తి లోకి ప్రవేశించేందుకు అర్హతగా నిర్వహించే పరీక్ష. ఏఎస్ఆర్బీ-నెట్. దీనిలో ఉత్తీర్ణత ఆధారంగా... అగ్రి యూనివర్సిటీల్లో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫె సర్ పోస్ట్లకు పోటీ పడే అర్హత లభిస్తుంది.
◾60 విభాగాల్లో ఏఎస్ఆర్: ఏఎస్ఆర్ నెట్ను మొత్తం అరవై విభాగాల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న విభాగానికి అను గుణంగా పీజీ స్థాయిలో సంబంధిత స్పెషలైజే షన్ తో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెట్కు హాజరై అందులో స్కోర్ సాం తం చేసుకుంటే ఆ స్కోర్ ఆధారంగా.. స్టేట్, సెంట్రల్ లెవల్ అగ్రి యూనివర్సిటీల్లో లెక్చ రర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్లకు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది.
◾ఆన్లైన్ విధానంలో... ఏఎస్ఆర్మ్-నెట్: ఏఎస్ ఆర్బి నెట్ను ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ పద్ద తిలో 150 ప్రశ్నలు- 150 మార్కులకు నిర్వహి స్తారు. పరీక్ష సమయం రెండు గంటలు, అభ్య ర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ విభాగం నుంచే ఈ ప్రశ్నలు ఉంటాయి. ఆన్-రిజర్వ్ డ్, ఈడ బ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులు 50 శాతం, ఓబీసీ వర్గాలు 45 శాతం, ఎస్సీ, ఎస్బీ, పీడబ్ల్యూడీ వర్గాలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉం టుంది.
◾అర్హతలు: అగ్రికల్చర్ అనుబంధ విభాగాల్లో నెట్లో ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్తో పీజీ ఉత్తీ ర్ణత ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు సెప్టెంబర్ 30 లోపు పీజీ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
◾వయసు: జనవరి 1 నాటికి 21 ఏళ్లు నిండి ఉం డాలి. గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు.
అగ్రి సైంటిస్ట్ కొలువులకు మార్గం, ఏఆర్ఎస్ టెస్ట్
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐ సీఏఆర్) లో.. తమకు అర్హత కలిగిన విభాగాల్లో శాస్త్ర వేత్తలుగా కొలువుదీరడానికి ఏఎస్ఆర్ నిర్వహి స్తున్న ఎంపిక ప్రక్రియ ఏఆర్ఎస్ బెస్ట్. ఈ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి నియామకం ఖరారు చేసుకుంటే.. పే లెవల్ 10తో రూ. 57,700 -1,82,400 శ్రేణితో కొలువు సాదించొచ్చు.
55విభాగాలు, 458 ఖాళీలు: ఏఎస్ఆర్బి తాజా గా ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం- మొత్తం 55 విభాగాల్లో 458 సైంటిస్ట్ పోస్ట్లను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు తాము దరఖాస్తు చేసుకునే విభాగానికి సంబంధించిన స్పెషలైజేష న్తో పీజీ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
◾మూడు దశల్లో విఆర్ఎస్ ఎంపిక ప్రక్రియ: అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీసెస్లో సైంటిస్ట్ల నియామకానికి ఏఎస్ఆర్్బ మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. అవి.. ఏఆర్ ఎస్ ప్రిలిమినరీ, ఏఆర్ఎస్ మెయిన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ.
◾ఏఆర్ఎస్ ప్రిలిమినరీ, మెయిన్స్ ఇలా: ఏఎస్ఆ రోబీ మూడు దశలుగా ఎంపిక ప్రక్రియను నిర్వ హిస్తోంది. మొదటి దశ ప్రిలిమినరీని అబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్ పద్ధతిలో 150 మార్కులకు రెండు గంటల వ్యవధిలో రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ లో నిర్ణీత కటాఫ్ మేరకు మెరిట్ జాబితా రూపొందించి ఒక్కో పోస్టు పదిహేను మందిని (1:15 నిష్పత్తి) చొప్పున మెయిన్స్కు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష మూడు గంటల వ్యవ దిలో పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో 300 మార్కులకు పెన్ పేపర్ పద్ధతిలో నిర్వహిస్తారు.
◾చివరగా ఇంటర్య్వూ: మెయిన్స్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్కు ముగ్గురిని (1,3 నిష్పత్తి) చొప్పున చివరి దశ పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఈ దశలో నిపుణుల కమిటీ అభ్యర్థులకు సైంటిస్ట్గా కొనసాగేందుకు ఉన్న ఆసక్తిని, వ్యక్తిగత సామర్ధ్యాలను పరిశీలి స్తారు. ఇందులోనూ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థు లతో మెరిట్ జాబితా రూపొందించి పోస్ట్లు, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుంటూ తుది నియామకాలు ఖరారు చేస్తారు.
◾అర్హతలు: అగ్రికల్చర్, అనుబంధ విభాగాలు, ఇతర నిర్దే శిత స్పెషలైజేషన్లతో పీజీ ఉత్తీర్ణత ఉండాలి. వ యను: ఆగస్ట్ 1 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయో పరిమితిలో సడలింపు.
ఆన్-రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు గరిష్టంగా ఆరు సార్లు, ఓబీసీ వర్గాల అభ్యర్థులు గరిష్టంగా తొమ్మిది సార్లు మాత్రమే ఏఆర్ఎస్ పరీక్ష రాసేం దుకు అనుమతి లభిస్తోంది. ఎస్సీ, ఎస్బీ వర్గాల విద్యార్థులు తమ వయో పరిమితి ముగిసేలోపు ఎన్నిసార్లయినా పరీక్ష రాయొచ్చు.
ఎస్ఎంఎస్, ఎన్టీఓ పరీక్ష
అగ్రికల్చరల్ సైంటిస్ట్ రీసెర్చ్ బోర్డ్... అగ్రి పీజీ ఉత్తీర్ణులకు సుస్ధిర కొలువు దిశగా నిర్వహిస్తున్న మరో పరీక్ష-- సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ఎస్ఈఓ) ఎగ్జామినేషన్. ఇం దులో ఉత్తీర్ణత ఆధారంగా ఐసీఏఆర్, దాని అను బంధ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో టీ-8 లెవల్లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, సబ్జెక్ట్ మేటర్ స్పెషలి స్త్రీగా కొలువు సొంతం చేసుకోవచ్చు.
◾125 పోస్ట్ల భర్తీ: ఏఎస్ఆర్బీ తాజా నోటిఫికే షన్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఐసీఏఆర్, ఐసీఏ ఆర్ అనుబంధ 64 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో 125 పోస్ట్లను భర్తీ చేయనున్నారు. సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్టు సంబంధించి 41, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్కు సంబంధించి 83 పోస్ట్లు ఉన్నాయి.
◾రాత పరీక్ష ఇంటర్వ్యూ: సబ్జెక్ట్ మేటర్ స్పెష లిస్ట్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ ఎంపికలో భాగంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహి స్తారు. తొలి దశలో రాత పరీక్షను ప్రిలిమినరీ, మెయిన్స్ దశలుగా ఉంటుంది. ప్రిలిమినరీ పరీ క్షలో 150 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.. మెయిన్ పరీక్షలో 300 మార్కులకు పరీక్ష ఉం టుంది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టు ముగ్గురుని (1.3 నిష్పత్తి) చొప్పున పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 45 మార్కులకు ఉండే పర్సనల్ ఇంటర్వ్యూలోనూ విజయం సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన వారికి రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుం టూ నియామకాలు ఖరారు చేస్తారు.
అర్హతలు:
◾సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
◾వయసు: మే 21నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య లో ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ వర్గాలకు నిబంధ సలకు అనుగుణంగా సడలింపు లభిస్తుంది.
ముఖ్య సమాచారం:
◾దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
◾ఏఆర్ఎస్ టెస్ట్, ఎస్ఎంఎస్/ఎన్టీఓ దరఖాస్తు చివరి తేదీ: 2025, ఏప్రిల్ 22 మే 21 వరకు
◾ఎస్ఆర్ నెట్, ఏఆర్ఎస్/ఎస్ఎంఎస్/ఎస్ టీఓ(ప్రిలిమినరీ) పరీక్ష తేదీ: సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు.
◾ఏఆర్ఎస్, ఎస్ఎంఎస్, ఎన్టీఏ మెయిన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 7
◾పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://asrb.org.in/