ఏపీ ఈసెట్-2024 : ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్
AP ECET - 2024: Engineering Common Entrance Test (Conducted by JNTU Anantapur on behalf of APSCHE)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(ఏపీఎ సీసీహెచ్ఐ).. ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీ ఈసెట్-2024) నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ /బీటెక్ /బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ పరీక్షను జేఎన్టీయూ అనంతపురం నిర్వహించనుంది.
» అర్హత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, బీఎస్సీ మ్యాథ్స్ పూర్తిచేసిన విద్యార్థులు అర్హులు.
» ఎంపిక విధానం: ఏపీఈసెట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» పరీక్ష విధానం: ప్రశ్నాపత్రం 200 ప్రశ్నలతో మొత్తం 200 మార్కులకు ఉంటుంది. కోర్సుకు అనుగుణంగా ప్రశ్నాపత్రాలు ఉంటాయి.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులకు చివరి తేదీ: 15.04.2024.
» పరీక్ష తేదీ: 08.05.2024
» వెబ్సైట్: https://cets.apsche.ap.gov.in