Type Here to Get Search Results !

అన్ని పరీక్షలూ ఆఫ్ లైన్ లోనే : నాన్-టెక్నికల్, టెక్నికల్ సర్వీసెస్ గా పోస్టుల వర్గీకరణ

అన్ని పరీక్షలూ ఆఫ్ లైన్ లోనే : నాన్-టెక్నికల్, టెక్నికల్ సర్వీసెస్ గా పోస్టుల వర్గీకరణ 



ఆగస్టు 31 నాటికి ఖాళీలను ప్రభుత్వ శాఖలు ప్రకటించాలి.

• వీటికి తగ్గట్లు ఏపీపీఎస్సీ 'జాబ్ క్యాలెండర్' రూపొందించాలి.

• మౌఖిక పరీక్షలో మార్కులు 80% దాటితే కారణాలు రికార్డులో నమోదుచేయాలి.

• ప్రతి పరీక్షకూ 3 వేర్వేరు ప్రశ్నపత్రాలు సిద్ధం చేయాలి.

• ప్రభుత్వ శాఖల పోస్టుల భర్తీ కమిషన్ ద్వారానే జరగాలి.

• సంస్కరణలపై ఏర్పడ్డ ప్రత్యేక కమిటీ తుది నివేదిక.

రాష్ట్రప్రభుత్వ శాఖల్లోని 272 రకాల పోస్టులను నాన్ టెక్నికల్, టెక్నికల్ సర్వీసెస్ కేటగిరీలుగా విభజించి, నియామకాలు చేపట్టాలని ఏపీపీఎస్సీలో సంస్కరణల కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. నియామక పరీక్షలన్నిం టినీ ఆన్లైన్ విధానంలోనే నిర్వహించాలని సూచిం చింది. నాన్-టెక్నికల్ విభాగంలో గ్రూప్-1, గ్రూప్- 2. సర్వీసెస్ను చేర్చింది. టెక్నికల్ సర్వీసెస్లో ఏ, బీ, సీ కేటగిరీల కింద ఇంజినీరింగ్, టెక్నికల్ ఆసి స్టెంట్ పోస్టులను ఉంచాలని సూచించింది. ఏపీ టీచింగ్ సర్వీసెస్లో ఏ, బీ కేటగిరీల వారీగా, ఏపీ. టెక్నికల్ సర్వీసెస్లో ఇతర పోస్టుల భర్తీ చేపట్టా లని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, కళాశాలల అధ్యాప కులు, ఇంజినీరింగ్, ఇతర పోస్టుల భర్తీ వేర్వేరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి.. ఏపీపీఎస్సీ ద్వారా జరిగే నియామ కాలు, పరీక్షా విధానం, ప్రతిపాదనల్లో ఉన్న పోస్టుల రీ-గ్రూపింగ్, ఇతర అంశాలపై కమిటీ అధ్యయనం చేసింది. ఢిల్లీలోని యూపీఎస్సీ, రాజస్థాన్, కేరళ, బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాలను సందర్శించి, అక్కడి కార్యకలాపాల తీరు సమీక్షిం చింది. వీటిని ఏపీపీఎస్సీ కార్యకలాపాలతో సమ స్వయం చేస్తూ తీసుకురావాల్సిన సంస్కరణలపై రూపొందించిన తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వశాఖల్లో పోస్టుల భర్తీ ఏపీ పీఎస్సీ ద్వారానే జరగాలని పేర్కొంది. ప్రస్తుతం కొన్ని శాఖలు వాటికవే నియమించుకుంటున్నాయి.

నాన్-టెక్నికల్ సర్వీసెస్

గ్రూప్-1 సర్వీసెస్  కేటగిరీ-ఎ (స్టేట్/మల్టీ జోన్), కేటగిరీ- బీ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీ (ప్రిలిమ్స్/మెయిన్స్/ఇంటర్వ్యూ)

గ్రూప్-2 సర్వీసెస్  కేటగిరీ- ఏ రాష్ట్రపతి పరిధి లోకి రానివి. కేటగిరీ- బి జోన్, జిల్లా స్థాయి.

టెక్నికల్ సర్వీసెస్

కేటగిరీ-ఏ అసి స్టెంట్ డైరెక్టర్ / తత్సమాన పోస్టు/స్కేల్- రాష్ట్ర స్థాయి/మల్టీజోన్ స్క్రీనింగ్ టెస్ట్.

కేటగిరీ-బీ అసి స్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, తత్సమాన పోస్టులు - జోనల్ స్థాయి.

కేటగిరీ-సీ ఇంజినీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్ (టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజినీర్) జిల్లా స్థాయి.

ఏపీ టీచింగ్ సర్వీసెస్

కేటగిరీ-ఏ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ (డిప్యూటీ ఈఓ, డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్ల పోస్టులు) ఆబ్జెక్టివ్, మౌఖిక పరీక్ష

కేటగిరీ-బీ  ఎడ్యుకేషనల్ సబార్డినేట్ సర్వీసెస్ (జిల్లా-సింగిల్ టెస్ట్-ఆబ్జెక్టివ్ విధానం)

ఏపీ టెక్నికల్ సర్వీసెస్

కేటగిరీ-ఏ స్టేట్ లెవెల్ సర్వీసెస్ (స్టేట్ లెవెల్/మల్టీ-జోన్) ఆబ్జెక్టివ్, మౌఖిక పరీక్షలు

కేటగిరి-బీ సవార్డినేట్ సర్వీసెస్ (జోనల్) అబ్జెక్టివ్, మౌఖిక పరీక్షలు

కేటగిరీ-సీ సబార్డినేట్ సర్వీస్స్ (జిల్లా) ఆబ్జెక్టివ్ పరీక్ష మాత్రమే

సెప్టెంబరు 1 నుంచి ప్యానల్ ఇయర్:

ప్రతి ఏడాది 'ప్యానల్ ఇయర్ను సెప్టెంబరు 1 నుంచి ప్రారంభించాలి. ఆగస్టు 31 నాటికి ప్రభుత్వ శాఖల యూనిట్ ఆఫీసర్లు ఖాళీల వివరాలను ఆన్ లైన్ ద్వారా పంపాలి. మంజూరైన పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి అక్కర్లేదు. జూన్ నుంచి కస రత్తు ప్రారంభించాలి. దీనికి అనుగుణంగా ఏపీపీ ఎస్సీ 'జాబ్ క్యాలెండర్'న్ను ఖరారు చేయాలి. మరుసటి సంవత్సరం డిసెంబరులోగా నియామ కాలు పూర్తి కావాలి. కమిషన్ ఎంపికచేసే అభ్యర్ధు లకు మార్చిలోగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలి. ప్రస్తుత నియామకాల తీరు ఆందోళనకరంగా ఉంది. శాఖల నిర్లక్ష్యం వల్ల నోటిఫికేషన్ల జారీ, పోస్టుల భర్తీ ఓ పద్దతి ప్రకారం జరగట్లేదు. కేరళ, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, యూపీఎ స్సీలో ఓ పద్ధతి ప్రకారం నోటిపికేషన్ల జారీ, నియామకాలు జరుగుతున్నాయి.

80% మార్కులు దాటితే రికార్డు చేయాలి:

బీహార్లో మౌఖిక పరీక్షల నిర్వహణ విధానం బాగుంది. ప్రధాన పరీక్షల మొత్తం మార్కుల్లో 10% మాత్రమే మౌఖిక పరీక్షలకు కేటాయించాలి. బోర్డు చైర్మన్, ఇతర సభ్యులు అభ్యర్థికి ఇచ్చిన మార్కులను కలిపి 'స్కోర్ను రికార్డు చేస్తారు. ఈ క్రమంలో ఇంట ర్వ్యూలకు హాజరైన అభ్యర్ధులకు సాధారణంగా 50% నుంచి 80%, మధ్య మాత్రమే మార్కులు వస్తాయి. అంతకుమించి మార్కులొస్తే అందుకు కారణాలను రికార్డుల్లో నమోదుచేయాలి. మౌఖిక పరీక్షకు 15 సమి షాల ముందే పాల్గొనేవారికి ఏ బోర్డుకు వెళ్లాలో చెప్పేలా సాఫ్ట్వేర్ ర్యాండమైజేషన్ విధానాన్ని తీసుకు రావాలి. అభ్యర్థులను బోర్డులకు పంపడంలోనూ సాప్ట్ వేర్ ఆధారిత ర్యాండమ్ విధానాన్ని అవలంబించాలి. మెయిన్, మౌఖిక పరీక్షల్లో వచ్చిన మార్కులను కలిపి మెరిట్ జాబితా ప్రకటించాలి. ఈ విధానాల ద్వారా పారదర్శకత పెరుగుతుంది.

అభ్యర్థుల వివరాలు పూర్తిగా చెప్పకూడదు:

◾బిహార్ మాదిరిగా మౌఖిక పరీక్షల నిర్వహ ణలో అనుసరిస్తున్నట్లు ప్రిలిమ్స్/మెయిన్స్ వచ్చిన మార్కులు, మతం, చిరునామా వివరాలు బయట పెట్ట కూడదు. అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హత, సాంకే తిక విద్యార్హతలే బోర్డు సభ్యులకు తెలియచేయాలి.

◾గ్రూప్-1 ప్రిలిమ్స్ వచ్చే మార్కులను మొత్తం మార్కులకు కలపకూడదు.

◾గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో సూపరింటెం డెంట్, తత్సమాన పోస్టులను చేర్చారు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కేటగిరీ-ఏ, బీలకు ఒకేలా ఉండాలి.

◾జలవనరులు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసర ఫరా, రహదారులు-భవనాలు, గిరిజన సంక్షేమం, మున్సిపల్.. పట్టణాభివృద్ధి విభాగాల్లో ఇంజినీరింగ్ ఉద్యోగాలను ఏపీ ఇంజినీరింగ్ సర్వీసెస్ గ్రూప్ లోకి

మూడు రకాల ప్రశ్నపత్రాలు:

అన్ని రకాల పరీక్షలనూ ఆన్లైన్లోనే నిర్వహిం చాలి. మూడు రకాల పరీక్షా ప్రశ్నపత్రాలను ఎరుపు, పసుపు, పచ్చ రంగుల్లో ముద్రించాలి. అన్బర్ బుక్లె ట్లోనే ప్రశ్నలూ అనుసంధానంగా ఉండాలి. బిహార్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఇదే విధానాన్ని అనుసరి స్తుంది. సంస్కరణల కమిటీకి చైర్మన్ గా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కన్వీనర్ సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ఉన్నారు. మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area