Type Here to Get Search Results !

రైల్వేలో 'పాపులర్' కొలువులు

 రైల్వేలో 'పాపులర్' కొలువులు


» నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 8,875 ఉద్యోగాలు

» ఇంటర్మీడియెట్, డిగ్రీ అర్హతతో పోటీ పడే అవకాశం

» మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ

ప్రభుత్వ ఉద్యోగార్థులకు ఎంతో సుపరిచితమైన రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ (ఆర్ ఆర్ బి) మరో భారీ నోటిఫికేషన్ తో ముందుకొచ్చింది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు(ఎన్టీపీసీ)గా పేరొందిన వివిధ రకాల పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. స్టేషన్ మాస్టర్ నుంచి జూనియర్ టైపిస్ట్ వరకు మొత్తం 8,875 పోస్ట్లను భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ. పరీక్ష విధానం, సిలబస్ అంశాలు, ప్రిపరేషన్ తదితర వివరాలు.

నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్ట్లు

ఆరిఆర్బి తాజా నోటిఫికేషన్ ద్వారా నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలోని పలు హోదాల్లో పోస్ట్లను భర్తీ చేయనుంది. వీటిని గ్రాడ్యుయేట్, నాన్-గ్రాడ్యుయేట్ పోస్ట్లుగా వర్గీకరించారు.

గ్రాడ్యుయేట్ పోస్ట్లు

స్టేషన్ మాస్టర్ 615 పోస్టులు, గూడ్స్ ట్రైన్ మేనే జర్ 3425, ట్రాఫిక్ అసిస్టెంట్ 59, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 161, జూనియర్ అకౌం బ్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 921, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638 పోస్టులు ఉన్నాయి.

అండర్ - గ్రాడ్యుయేట్ లెవల్ పోస్ట్లు

ట్రైన్స్ క్లర్క్ 77 పోస్టులు, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2424, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 394, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 163 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు

• గ్రాడ్యుయేట్ పోస్ట్లకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

• అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్లకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులవ్వాలి.

వయసు

• గ్రాడ్యుయేట్ పోస్ట్లకు 33 ఏళ్లలోపు ఉండాలి.

• ఆండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్లకు 30 ఏళ్లలోపు

మూడు దశల ఎంపిక ప్రక్రియ

పోస్టుల కేటగిరీని బట్టి ఎంపిక ప్రక్రియ నిర్వ హించనున్నారు. మొత్తంగా మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ బెస్ట్-1, కం ష్యూటర్ బేస్డ్ టెస్ట్-2, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, కం ప్యూటర్ బేస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్లకు హాజరవ్వాల్సి ఉంటుంది. సీబీటీ-1, సీబీటీ-2లు అన్ని పోస్ట్లకు తప్పనిసరి కాగా, మిగిలిన బెస్ట్లు ఆయా పోస్ట్ లను బట్టి నిర్వహిస్తారు.

తొలిదశ సీబీటీ -1

ఎంపిక ప్రక్రియలో తొలి దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.. సీబీటీ1ను మూడు విభాగాల్లో 100 మార్కు లకు నిర్వహిస్తారు. జనరల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు-40 మార్కులకు, మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు-30 మార్కులకు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు-30 మార్కులకు అడుగుతారు. పరీక్ష వ్యవధి గంటన్నర. ప్రతితప్పు సమాధానానికి 1/3 వంతు మార్కును నెగెటివ్ మార్క్ గా పరిగణిస్తారు.

సీబీటీ-2

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1లో చూపిన ప్రతిభఆధారంగా.. రిజర్వేషన్లను అనుసరించి ఒక్కో పోస్ట్కు 15 మందిని చొప్పున ఎంపిక చేసి.. వారికి రెండో దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-2 నిర్వహి స్తారు. ఇందులో.. జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులకు, మ్యాథమెటిక్స్ 35 ప్రశ్నలు-35 మార్కులకు, జనరల్ ఇంటెలిజెన్స్ 35 ప్రశ్నలు-35 మార్కులకు ఉంటాయి. మొత్తం 120 మార్కు లకు సీబీటీ-2 ఉంటుంది. పరీక్ష వ్యవధి గంటన్నర. ప్రతి తప్పు సమాధా నానికి 1/3వంతు నెగెటివ్ మార్క్ నిబంధన ఉం టుంది.

కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్

ఆర్ఆర్బీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్ట్ల ఎంపిక ప్రక్రియలో మరో దశ కంప్యూటర్ టేస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీబీఏటీ), స్టేషన్ మాస్టర్ పోస్ట్ల అభ్యర్థులకు మాత్రమే దీన్ని నిర్వహిస్తారు. సీబీటీ-1, సీబీటీ-2లలో చూపిన ప్రతిభ ఆధారం గా ఒక్కో పోస్ట్కు 8 మందిని చొప్పున సీబీఏటీకి ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో అభ్యర్థుల్లో నిర్ణయాత్మక సామర్థ్యం, సమ యస్ఫూర్తి ఆధారిత ప్రశ్నలు ఉంటాయి.

కొన్ని పోస్ట్లకు టైపింగ్ స్కిల్ టెస్ట్

ఆర్ఆర్బీ నాన్-టెక్నికల్ పోస్ట్ల ఎంపిక ప్రక్రి యలో భాగంగా కొన్ని పోస్ట్లకు టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు. గ్రాడ్యుయేట్ పోస్ట్లలో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్లకు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్లో ఆకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ల అభ్యర్ధులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వ హిస్తారు. టైపింగ్ స్కిల్ టెస్ట్లో భాగంగా... ఇంగ్లి ష్టో నిమిషానికి 30 పదాలు, హిందీలో నిమిషా నికి 25 పదాలు చొప్పున కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుంది.

మెరిట్ ఆధారంగా నియామకం

ఇలా అన్ని దశల ఎంపిక ప్రక్రియలో ఉత్తీర్ణత సాధించిన వారి మార్కులను పరిగణనలోకి తీసు కుని.. మెరిట్ ఆధారంగా నియామకాలు ఖరారు చేస్తారు. ఆ తర్వాత రైల్వేలో నిర్దిష్ట వ్యవధిలో శిక్షణ నిచ్చి పూర్తి స్థాయి విధులు కేటాయిస్తారు.

విజయం సాధించాలంటే

అన్ని పోస్ట్లకు ఉమ్మడిగా ఉండే కంప్యూటర్ బే స్ట్ టెస్ట్-1, టెస్ట్-2లలో రాణించడానికి అభ్యర్థులు విభాగాల వారీగా దృష్టి సారించాల్సిన అంశాలు...

జనరల్ అవేర్నెస్

ఈ విభాగంలో జనరల్ నాలెడ్జ్ నుంచి చరిత్ర, భౌగోళిక శాస్త్రం, సివిక్స్ లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సోషల్ పాఠ్య పుస్తకాలను ఔపోసన పట్టాలి. ముఖ్యమైన తేదీలు, ఘట్టాలు, వ్యక్తులు, రికా ర్థులు, యుద్ధాలు, ముఖ్యమైన భోగోళిక వనరులు, సరిహద్దులు, నదులు, సముద్రాలు, పర్వతాలపై పరిపూర్ణత ఉండాలి. సివిక్సు సంబంధించి రాజ్యాంగం గురించి ప్రాథమిక అవగాహన, వివిధ రాజ్యాంగ సంస్థలు, రాష్ట్రాలు- గవర్నర్లు వంటి విషయాల్లో నైపుణ్యం అవసరం. జనరల్ సైన్స్కు సంబంధించి ప్రాథమిక అంశాల్లో పట్టు సాధిం చాలి. వ్యాధులు, వ్యాక్సీన్లు, విటమిన్లు, మోడ్రన్ ఫిజిక్స్లపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

మ్యాథమెటిక్స్

ఈ విభాగంలో శాతాలు, లాభ-నష్టాలు, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, మెన్సురేషన్, పర్యుటేషన్, నిష్పత్తులు-విలువలు ముఖ్యమైనవి. హై స్కూల్ స్థాయి గణిత పుస్తకాల అధ్యయనంతో పాటు పై చార్ట్స్, బార్ గ్రాఫ్ను ప్రాక్టీస్ చేయాలి.

జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్

నంబర్ సిరీస్, కోడింగ్ - డీకోడింగ్, బ్లడ్ రిలే షన్స్, క్లాసిఫికేషన్, డైరెక్షన్, క్యాలెండర్, క్లాక్, బాడ్ మాస్ పై పట్టు సాధించాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్, 1 నుంచి 25 వరకు మ్యాథమెటికల్ టేబుల్స్పై అవగాహన పొందాలి.

బేసిక్స్ పై పట్టు

అభ్యర్థులు ఆయా అంశాలకు సంబంధించి బేసి కై ్ప పూర్తి అవగాహన పొందాలి. ఆ తర్వాత అబ్జె క్టివ్ ఓరియెంటేషన్తో ప్రాక్టీస్ పేపర్స్ సాల్వ్ చేయాలి. మోడల్ టెస్ట్లు, మాక్ టెస్ట్లకు హాజరైతే ఉపయుక్తంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్న పరీక్ష కాబట్టి ఈ విషయంలోనూ నైపుణ్యం పొందాలి.

గత ప్రశ్న పత్రాల సాధన

ప్రిపరేషన్లో భాగంగా అభ్యర్థులు గత ప్రశ్న పత్రాలను సాధన చేయడం మేలు. ఫలితంగా ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీ, ప్రశ్నలు అడుగుతున్న తీరు, ప్రశ్నల క్లిష్టత స్థాయి వంటి వాటిపై అవగాహన పొందొచ్చు. సీబీటీ-1, సీబీటీ -2., ఈ రెండింటిలోనూ ఉమ్మడి విభాగాలే ఉన్నా యి. సీబీటీ-2లో ఆయా విభాగాల్లో ప్రశ్నల సంఖ్య క్లిష్టత స్థాయి కొంత ఎక్కువగా ఉంటుంది.

ఒకే ఆర్ ఆర్ బి దరఖాస్తు

దేశ వ్యాప్తంగా ఉన్న 21 ఆర్ఆర్బీల్లో ఖాళీలున్న నేపథ్యంలో అభ్యర్థులు ఏదో ఒక ఆర్డర్బికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. తమకు ఆసక్తి ఉన్న ఆర్ఆర్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్ అప్లికే షన్ లింక్ మీద క్లిక్ చేసి తమ దరఖాస్తు ప్రక్రియ. పూర్తి చేయాలి. ఆర్ఆర్త్బో సికింద్రాబాద్ అభ్యర్థులు www.rrbsecuderabab.gov.in ఓపెన్ చేసి ఆన్లైన్ ఆప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి.

ముఖ్య సమాచారం

• దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

• గ్రాడ్యుయేట్ పోస్ట్లకు దరఖాస్తు తేదీలు: అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 వరకు:

• అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్లకు దరఖాస్తు తేదీలు: అక్టోబర్ 28 నుంచి నవంబర్ 27 వరకు దరఖాస్తు చేసుకోవాలి.

• వెబ్సైట్: www.rrbsecunderabad.gov.in

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area