నేషనల్ ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ సెంటర్ (ఎన్ఐటీసీ) లో పారామెడికల్ కోర్సులు
న్యూఢిల్లీలోని నేషనల్ ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ సెంటర్(ఎన్ఐటీసీ) - క్రాఫ్ట్స్మెన్ ట్రెయినింగ్ ఎస్) కింద పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖా స్తులు కోరుతోంది. వీటిని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఆంత్రప్రె న్యూర్షిప్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. నిబంధనల ప్రకారం కోర్సులు పూర్తిచేసినవారికి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రెయినింగ్ (ఎన్సీవీటీ) సర్టిఫికెట్లు ప్రదానం చేస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రముఖ పీఎస్ యూలలో సబార్డినేట్ ఉద్యోగాలు సహా వివిధ సర్వీస్ పోస్టుల భర్తీకి ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి. ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వ నిబంధ నల మేరకు రిజర్వుడు అభ్యర్థులకు స్కాలర్షిప్ సౌకర్యం వర్తిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం బస్పాస్ సౌకర్యం కల్పిస్తుంది.ఇందుకు నెలకు రూ.100లు చెల్లిం చాల్సి ఉంటుంది.
కోర్సులు-సీట్లు: హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో 216 సీట్లు ఉన్నాయి. ఫిజియో థెరపి టెక్నీషియన్ కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో 60 సీట్లు ఉన్నాయి. డెంటల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో 24 సీట్లు ఉన్నాయి. రేడియా లజీ టెక్నీషియన్ కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో 20 సీట్లు ఉన్నాయి.
అర్హత: హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, ఫిజియోథెరపి టెక్నీ షియన్, డెంటల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులకు పదోతర గతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. రేడియాలజీ టెక్నీషియన్ సైన్స్ గ్రూప్తో ఇంటర్/ పన్నెండో రగతి పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థి వయసు ఆగస్టు 1 నాటికి పద్నాలుగేళ్లు నిండి ఉండాలి.
ముఖ్య సమాచారం :
• దరఖాస్తు ఫీజు: రూ.500
• దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 33
• వెబ్సైట్: www.nitcindia.com