ఆంధ్రా యూనివర్శిటీలో పీజీ, పీజీ డిప్లొమా ప్రవేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ, పీజీ డిప్లొమా (సెల్ఫ్ సపోర్టెడ్) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం సీట్ల సంఖ్య: 85.
కోర్సులు- సీట్ల వివరాలు
1. మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్-40 సీట్లు.
2. పీజీ డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ-15 .
3. పీజీ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ-15 సీట్లు.
4. పీజీ డిప్లొమా ఇన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ టెక్నాలజీ-15 సీట్లు.
» కోర్సు వ్యవధి: మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ రెండేళ్లు, పీజీ డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, ఎమ ర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ టెక్నాలజీ ఒక సంవత్సరం కోర్సు.
» అర్హత: కోర్సును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎస్సీలో ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 20 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఆంధ్రా యూనివర్శిటీ, విజయన గర్ ప్యాలెస్, పెద్దవాల్తేర్, విశాఖపట్నం-530003 చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 09.10.2025.
» దరఖాస్తులకు చివరి తేదీ: 07.11.2025.
» వెబ్ సైట్: https://audoa.andhrauniversity.edu.in
