తెలంగాణలో 'మెగా' డీఎస్సీ
» 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్, ఫిబ్రవరి 29(ఆంధ్రజ్యోతి): మెగా డీస్సీకి నోటిఫికేషన్ వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురు వారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ప్రభుత్వం 5,089 ఖాళీలతో విడుదల చేసిన నోటిఫికేషనన్ను రేవంత్ సర్కారు రద్దు చేసి, అదనపు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థి ఒకటికి మించి పరీక్షలు రాయాలనుంటే అన్నింటికీ వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి దరఖాస్తుకు ఫీజు రూ.1000గా నిర్ణయించారు. టీచర్ పోస్టుల భర్తీలో 95 శాతం స్థానికతను అమలు పరచనున్నారు. ఆయా జిల్లా ల్లోని పోస్టులకు రోస్టర్ విధానాన్ని అమలు చేయనున్నారు. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తారు. 20 మార్కులతో టెట్ వెయిటేజీ ఉంటుంది. రాత పరీక్షను 80 మార్కులకు పెడ తారు. ప్రశ్నకు అర మార్కు చొప్పున మొత్తంగా 160 ప్రశ్న లుంటాయి. 100 మార్కులకు అభ్యర్థులు మెరిట్ జాబితాను రూపొందించి.. నియామకాలను చేపట్టనుంది.
వయోపరిమితి ఎంత ?
గత నోటిఫికేషన్తో పోల్చితే తాజా నోటిఫికేషన్లో వయో పరిమితిని రెండేళ్లు పెంచారు. ఈ మేరకు టీచర్ పోస్టుల అభ్యర్థి వయసు 01/07/2023 నాటికి 18 ఏళ్ల నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. ఎక్స్ సర్వీసెమెన్ కేటగిరీ వారికి మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్, ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, పీహెచ్సీలకు 10 ఏళ్ల వెసులుబాటు ఉంటుంది.
• టీచర్ పోస్టుల వివరాలు...
• స్కూల్ అసిస్టెంట్ - 2,629
• లాంగ్వేజ్ పండిట్ - 727
• ఫిజికల్ ఎడ్యుకేషన్ - 182
• ఎస్జీటీ - 6,508
• ఎస్ఏ (స్పెషల్ ఎడ్యుకేషన్) - 220
• ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) - 796
◾మొత్తం - 11,062