5వ తేదీన టెట్, డీఎస్సీ ప్రకటన
రాష్ట్రంలో డీఎస్సీ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రకటనను ఈనెల 5న విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే దరఖాస్తులు స్వీకరిస్తారు. డీఎ స్సీలో 6,100 పోస్టులను భర్తీ చేయను న్నారు. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యో గులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదు. ఈసారి కొత్తగా 12ఏళ్ల క్రితం తొలగించిన అప్రెంటిస్క్రిప్ విధానాన్ని తీసుకురానున్నారు. డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్లపాటు గౌరవవేతనా నికి పని చేయాల్సి ఉంటుంది. అప్రెంటిస్ షిప్ సమయంలో ఎవరైనా ఏపీ ఉద్యోగుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం భావిస్తే వారి అప్రెంటిస్ షిప్ సమయాన్ని పెంచే అవకాశం ఉంటుంది. టెట్, డీఎస్సీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ టీసీఎస్తో ఒప్పందం కుదుర్చుకోనుంది.