ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీ సెట్ 2024)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష(ఏపీ సెట్ 2024) నోటిఫికేషన్ను ఆంధ్ర విశ్వవిద్యాలయం విడుదల చేసింది. రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు నియామకా నికి అర్హత సాధించేందుకు ఈ పరీక్షను ఉద్దేశించారు.
సబ్జెక్టులు:
ఆంత్రోపాలజీ,
హిస్టరీ,
కెమికల్ సైన్సెస్,
కామర్స్,
కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్,
ఎకనామిక్స్,
ఎడ్యుకేషన్,
ఇంగ్లీష్,
ఎర్త్-అట్మాస్ఫియరిక్-ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్స్,
ఎన్విరాన్మెంటల్ సైన్స్,
జాగ్రఫీ,
హిందీ,
జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్,
లా,
లైఫ్ సైన్సెస్,
లైబ్రరీ అండ్ ఇన్ఫ ర్మేషన్ సైన్స్,
మేనేజ్మెంట్,
మేథమెటికల్ సైన్సెస్,
ఫిజికల్ సైన్సెస్,
ఫిజికల్ ఎడ్యుకేషన్,
ఫిలాసఫీ,
పొలిటికల్ సైన్స్,
సైకాలజీ,
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,
సంస్కృతం,
సోషియాలజీ,
సోషల్ వర్క్,
తెలుగు,
ఉర్దూ,
విజువల్ ఆర్ట్స్.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: గరిష్ఠ వయోపరిమితి లేదు.
పరీక్ష విధానం: పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
పరీక్ష రుసుము: జనరల్/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రూ.1200. బీసీ కేటగిరీకి రూ.1000. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగు లు/ట్రాన్స్ జెండర్ అభ్యర్థుకుఉ రూ.700.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 6
పరీక్ష తేదీ: ఏప్రిల్ 28
వెబ్ సైట్: https://apset.net.in/